బషీర్బాగ్, వెలుగు: రాపిడో ఆటోలో పొరపాటున వదిలేసిన సుమారు రూ. 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును సైఫాబాద్ పోలీసులు కేవలం 30 నిమిషాల్లోనే రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. తమిళనాడుకు చెందిన మణిమేగల ఈ నెల 27న రాత్రి లక్డీకాపూల్ వద్ద తన హ్యాండ్బ్యాగ్ను ఆటోలో మర్చిపోయింది. అందులో 27 గ్రాముల బంగారం, రూ. 30 వేల నగదుతోపాటు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుపై వెంటనే రంగంలోకి దిగిన సీఐ ఎ. సీతయ్య బృందం.. సాంకేతిక ఆధారాలతో ఆటో డ్రైవర్ను చాదర్ఘాట్ వద్ద గుర్తించి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించిన పోలీసుల పనితీరుపై బాధితురాలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
